News November 19, 2025

సంగారెడ్డి: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలి: ఎస్పీ

image

ప్రతి కేసులో దర్యాప్తు నాణ్యమైన చేయాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యక్రమంలో నేర సమీక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లాంగ్ పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు. ఎస్హెచ్ఓలు తమ ఏరియాలో గల ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఆయా ప్రాంతాలలో గల సమస్యలను తెలుసుకోవాలని అన్నారు.

Similar News

News January 15, 2026

77వ రిపబ్లిక్ డే వేడుకలకు గెస్టులు వీరే

image

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు గెస్టుల పేర్లను కేంద్రం ప్రకటించింది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా(పోర్చుగల్), యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ (జర్మనీ) రానున్నట్లు తెలిపింది. వేడుకల అనంతరం వీరు ఈనెల 27న PM మోదీతో ట్రేడ్ డీల్‌పై చర్చించనున్నారు. కాగా ఈ నెలాఖరున EUతో భారత్ ట్రేడ్ డీల్ సైన్ చేసే అవకాశముందని ట్రేడ్&కామర్స్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు.

News January 15, 2026

అనకాపల్లి: పండగపూట విషాదం

image

నక్కపల్లి హైవే వద్ద అడ్డరోడ్డు వెళ్లే మార్గంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ సన్నిబాబు చెప్పారు. ఎస్.రాయవరం (M) గెడ్డపాలేనికి చెందిన దాడిశెట్టి పవన్ (19) తన స్నేహితులతో బైకుపై వెళ్లున్నాడు. ఈ క్రమంలో నక్కపల్లి పాత ఇసుక ర్యాంప్ హైవే వద్ద లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పవన్ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

News January 15, 2026

ఉట్నూర్: గిరిజన ఉద్యాన కేంద్రంలో తీరొక్క మొక్కలు

image

ఉట్నూర్ మండల కేంద్రంలో ఉన్న ఐటీడీఏ ప్రాంగణ ప్రాంతంలోని గిరిజన ఉద్యాన కేంద్రంలో అనేక రకాల మామిడి మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలను విక్రయిస్తున్నారు. ఇది ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ అలంకరణ మొక్కలు, గిఫ్ట్ మొక్కలు బయటి కేంద్రంలో కంటే తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఉట్నూర్ మండల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.