News November 19, 2025

సంగారెడ్డి: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలి: ఎస్పీ

image

ప్రతి కేసులో దర్యాప్తు నాణ్యమైన చేయాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యక్రమంలో నేర సమీక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లాంగ్ పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు. ఎస్హెచ్ఓలు తమ ఏరియాలో గల ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఆయా ప్రాంతాలలో గల సమస్యలను తెలుసుకోవాలని అన్నారు.

Similar News

News January 24, 2026

గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

*గద్వాల: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
*రేపు పలు కాలనీలకు పవర్ కట్
*వేరుశనగకు రికార్డ్ ధర రూ.9,389
*అలంపూర్: సీఐగా ప్రదీప్ కుమార్
*శక్తిపీఠంలో భక్తుల సందడి
*అయిజ: బాల్యవివాహాలు భవిష్యత్తుకు అడ్డంకులు
*మానవపాడు: లైన్మెన్‌ను నియమించాలని వినతి
*ఎర్రవల్లి: అక్రమ చేపల చెరువులపై చర్యలు తీసుకోవాలి
*కేటిదొడ్డి: గణతంత్ర వేడుకలకు పాఠశాలలు ముస్తాబు
*ధరూర్: కనులపండువగా అంజన్న రథోత్సవం

News January 24, 2026

రామభద్రపురంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

రామభద్రపురంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బొబ్బిలి మండలం కమ్మవలసకు చెందిన రాము రామభద్రపురం నుంచి బొబ్బిలి వైపు బైక్ పై వెళ్తుండగా.. రామభద్రపురం వైపు వస్తున్న బొలెరో చిన్నమ్మ తల్లి ఆలయం వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాము తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

News January 24, 2026

హైకోర్టులే ప్రాథమిక సంరక్షకులు: సీజేఐ సూర్యకాంత్

image

సాధారణ ప్రజలకు న్యాయం అందించడంలో హైకోర్టుల పాత్ర అత్యంత కీలకమని CJI జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఇవి ప్రాథమిక సంరక్షకులుగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. న్యాయం ప్రజలకు దూరమైన భావన రాకుండా చేయడంలో వీటి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. HCలు కేవలం అప్పీల్/రివిజన్ కోర్టులుగా కాకుండా, రాజ్యాంగ పరిరక్షణకు అందుబాటులో ఉండే కేంద్రాలుగా మారాలన్నారు. నేరుగా SCను ఆశ్రయించడాన్ని తాను వ్యతిరేకిస్తానన్నారు.