News April 4, 2024
సంగారెడ్డి ప్రమాదంలో మృతుల వివరాలు..

సంగారెడ్డి జిల్లాలో <<12982731>>ఘోర ప్రమాదం<<>> సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుగురికి పెరిగింది. 15 మందికి గాయాలవ్వగా మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు.. ఎండీ, డైరెక్టర్ రవికుమార్ (హైదరాబాద్), ప్రొడక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం (36), దయానంద్ (48), సురేష్పాల్ (43), కార్మికుడు విష్ణు (35)గా గుర్తించారు. ఈ పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు.
Similar News
News February 11, 2026
మెదక్: నేడు సెలవు మంజూరు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్న వారందరికీ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసిందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ ఉత్తర్వులతో ఉద్యోగులందరికీ ఓటు వేసే మార్గం సుగమమైంది.
News February 10, 2026
మెదక్: 686 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్: ఎస్పీ

మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలటీల పరిధిలో బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. 74 వార్డులు, 148 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 686 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 17 రూట్లలో మొబైల్ పార్టీ, సీఐల ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్స్, నలుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేశామన్నారు.
News February 10, 2026
MDK: గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ ఓటు

మెదక్ మున్సిపాలిటీ గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ రాహుల్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు కలెక్టర్కు పోలింగ్ స్లిప్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ స్లిప్ల పంపిణీ కొనసాగుతోందన్నారు. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.


