News February 11, 2025
సంగారెడ్డి: రేపటి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు వాయిదా

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు కేటాయించడంతో రేపు జరగాల్సిన కాంప్లెక్స్ సమావేశాలు వాయిదా వేయడం జరిగిందని జిల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయాన్ని అన్ని మండలాల్లోని ఎంఈవోలు, ఉపాద్యాయులు గమనించాలని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
అమెరికా WC జట్టులో తెలుగు కుర్రాడు

T20WCలో USA తరఫున ఆడుతున్న ముక్కమల్ల సాయితేజ తెలుగు వ్యక్తే. సొంతూరు APలోని నంద్యాల(D) కలమలపురి. అతని పేరెంట్స్ నాగేశ్వర్రెడ్డి, లక్ష్మి అమెరికాలో స్థిరపడ్డారు. సాయితేజ అక్కడే జన్మించినప్పటికీ HYDలోని వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2022లో USA నేషనల్ టీమ్కు ఎంపికయ్యారు. 37 ODIలు, 19 T20Iలలో 1,896 రన్స్ చేశారు. ఇందులో 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
News February 9, 2026
పాలమూరు: తెలంగాణ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు

మీ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తారా? తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6th క్లాస్తో పాటు 7-10 క్లాసుల్లో ఖాళీల భర్తీకి అడ్మిషన్ల నోటిఫికేషన్ వచ్చేసింది. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష. స్మార్ట్ క్లాసులు, ల్యాబ్స్, భోజనం, యూనిఫామ్స్ ఫ్రీ. కొత్తకోట, భూత్పూర్, తిమ్మాజీపేట, NRPT, అయిజ తదితర చోట్ల శాఖలు ఉన్నాయి. FEB 28లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు tgms.telangana.gov.inను చూడండి.
News February 9, 2026
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు

AP: దేశంలోని ప్రఖ్యాత క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన విజయవాడ గుణదల మేరీమాత ఆలయంలో 102వ ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. FEB 11 వరకు జరిగే ఈ వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరుకానున్నారు. దీంతో అధికారులు RTC, రైల్వే స్టేషన్ల నుంచి ఆలయానికి బస్సులను ఏర్పాటుచేశారు. కాగా 1937 నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. వేళాంగిణీ మాత(TN) ఆలయం తర్వాత రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా గుణదల ప్రసిద్ధి.


