News September 10, 2025
సంగారెడ్డి: విద్యాభివృద్ధికి టీఎల్ఎం మేళా దోహదం: ఎఎంఓ

టీఎల్ఎం మేళా విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా ఎఎంఓ బాలయ్య పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని రావ్స్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాను ఎఎంఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యా బోధన మరింత మెరుగుపరచుకునేందుకు పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు టీఎల్ఎం ఉపయోగ పడుతుందని అన్నారు.
Similar News
News December 15, 2025
అమరజీవి త్యాగం చిరస్మరణీయం: జేసీ

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి వల్లే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని జేసీ అపూర్వ భరత్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి లల్లి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
News December 15, 2025
Eggoz కాంట్రవర్సీ.. గుడ్లను పరీక్షించనున్న FSSAI

Eggoz బ్రాండ్ గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందనే వార్త ప్రస్తుతం SMలో తెగ వైరలవుతోంది. యూట్యూబ్ ఛానెల్ ‘ట్రస్టిఫైడ్’ వీడియోతో ఈ ‘ఎగ్గోజ్’ వివాదం మొదలైంది. తాజాగా దీనిపై FSSAI స్పందించింది. గుడ్లలో విషపూరితమైన రసాయనం ‘నైట్రోఫ్యూరాన్స్’ ఉందా? లేదా? అనేదానిపై పరీక్షలు చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండెడ్, అన్ బ్రాండెడ్ గుడ్ల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపాలని ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది.
News December 15, 2025
కాకినాడలో వైసీపీ శ్రేణుల భారీ ర్యాలీ

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగింపు సందర్భంగా వైసీపీ శ్రేణులు సోమవారం కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించాయి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జులు, కార్యకర్తలు భానుగుడి నుంచి బాలాజీ చెరువు వరకు ప్రదర్శనగా తరలివచ్చారు. వైఎస్ విగ్రహం వద్ద సంతకాల ప్రతులను ఉంచి నివాళులర్పించారు. దాడిశెట్టి ఆధ్వర్యంలో వీటిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.


