News September 13, 2025

సంగారెడ్డి: 15న T-SAT ద్వారా ప్రత్యక్ష ప్రసారం

image

ఈనెల 15వ తేదీన T-SAT ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారాన్ని చూపించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రాథమిక విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటలకు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని చెప్పారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రాణా విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతారని పేర్కొన్నారు.

Similar News

News December 15, 2025

ధరలు మార్చకుండా ప్రయోజనాలు తగ్గించిన AIRTEL

image

ఎయిర్‌టెల్‌ తన అన్‌లిమిటెడ్ 5G బూస్టర్ ప్యాక్‌ల డేటా ప్రయోజనాలను గణనీయంగా తగ్గించింది. ₹51, ₹101, ₹151 ప్యాక్‌లపై గతంలో లభించిన 3GB, 6GB,9GB డేటా ఇప్పుడు 1GB, 2GB,3GBకు తగ్గించింది. ధరలు మారనప్పటికీ డేటా తగ్గడంతో వినియోగదారులకు నష్టం కలగనుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ ప్యాక్‌ల ప్రయోజనాలనూ ఇలానే తగ్గించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

News December 15, 2025

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు !

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు పలు కీలక సూచనలు చేస్తూ సోమవారం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్టలు నిషేధం అని తెలిపారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేల వాడకం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనలు ఈ నెల 31 వరకు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

News December 15, 2025

మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

image

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.