News February 26, 2025
సంగారెడ్డి: 27న ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించాలని వినతి

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో పరమేశం బుధవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు పోచారం రాములు మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థలకు సెలవు ఇవ్వకుంటే ఉద్యోగులు ఓటు వినియోగించుకోలేరని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వెంకట నర్సింహారెడ్డి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News February 27, 2025
అనుకోకుండా గెలవలేదు.. అలవాటు చేసుకున్నారు: సచిన్

CTలో ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించిన అఫ్గాన్ టీమ్పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ఎదుగుతున్న తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారు అనుకోకుండా గెలిచారని ఇకపై ఎవరూ భావించొద్దన్నారు. అఫ్గాన్ కుర్రాళ్లు గెలుపులను అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు. ఈ మ్యాచ్లో భారీ సెంచరీ చేసిన జద్రాన్, 5 వికెట్లు తీసిన ఒమర్జాయ్ని ప్రత్యేకంగా అభినందించారు.
News February 27, 2025
ADBలో ఆంక్షలు.. 144 సెక్షన్ అమలు: SP

ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNNS యాక్ట్ (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. 100-200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించడానికి చూసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా తిరగడం, పార్టీ జెండాలను పార్టీ గుర్తులను ధరించకూడదని హెచ్చరించారు.
News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.