News October 5, 2025
సంగారెడ్డి: NMMS ఉపకార వేతనాలకు రేపే చివరి తేదీ

నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్ (NMMS) ఉపకార వేతనాల దరఖాస్తుకు ఈనెల 6 చివరి తేదీ అని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ వసతి లేని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు www.bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.
Similar News
News January 24, 2026
బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్: క్రిక్ బజ్

T20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను ICC చేర్చినట్లు క్రిక్బజ్ వెల్లడించింది. గ్రూప్-సిలోని ఇటలీ, నేపాల్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లతోపాటు స్కాట్లాండ్ కూడా ఉంటుందని పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య కొంత కాలంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా <<18925836>>భారత్లో<<>> ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. BCB నిర్ణయంపై ఆ దేశ ప్లేయర్లూ <<18935631>>ఆందోళన <<>>వ్యక్తం చేశారు.
News January 24, 2026
సిరిసిల్ల: ఖననం చేసిన 24 రోజులకు పోస్టుమార్టం.. కారణం ఇదే!

మృతదేహం పాతిపెట్టిన 25 రోజులకు పోస్టుమార్టం చేసిన ఘటన పోచెట్టిపల్లిలో చోటు చేసుకుంది. పూడూరి ఎల్లయ్య (61) డిసెంబర్ 18న కారు ఢీకొని చికిత్స పొందుతూ 31న మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి చికిత్స చేయించడంతో మృతదేహాన్ని ఖననం చేశారు. ఇన్సూరెన్స్ సొమ్ము, కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం పోస్టుమార్టం రిపోర్టు అవసరమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, శనివారం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేశారు.
News January 24, 2026
స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు: హరీశ్

TG: భట్టి విక్రమార్క ఎన్ని సాకులు <<18943730>>చెప్పినా<<>> బొగ్గు కుంభకోణం, అందులో రేవంత్ బామ్మర్ది రింగ్మెన్ పాత్ర పోషించడం నిజమని హరీశ్ రావు ఆరోపించారు. లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు ‘భట్టి గారూ మీరంటే నాకు చాలా గౌరవం. దీనిపై సిట్టింగ్ జడ్జి, CBI విచారణ కోసమే కిషన్రెడ్డికి లేఖ రాశా. రేవంత్, అతని బామ్మర్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాస్తా’ అని తెలిపారు.


