News August 22, 2025

సదాశివనగర్: తిమ్మాజివాడి పనుల జాతరలో కలెక్టర్

image

సదాశివనగర్ మండలం తిమ్మాజివాడి గ్రామంలో పనుల జాతరలో ఈరోజు జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వన్ పాల్గొని మాట్లాడారు. గ్రామంలో చేపట్టబోయే పనులకు ప్రణాళిక తయారు చేసుకోవడం, కొత్త పనులకు శంకుస్థాపన, ఉపాధి హామీలో 100 రోజులు పనిచేసిన సభ్యులను, దివ్యాంగులను సన్మానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ సురేందర్, ఎంపీడీవో, మండల సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 22, 2026

రహదారులు రక్తం సిక్తం కాకూడదు: SP

image

రహదారులు రక్తశిక్తం కాకూడంటే నిబంధనలు పాటించాలని SP ధీరజ్ కునుబిల్లి తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు. కొత్త రోడ్లనే మోజు, కొద్ది దూరం ఆదా అవుతుందన్న ఆత్రుతతో రహదారి నిబంధనలను తుంగలో తొక్కితే ఆ దారి నేరుగా మృత్యువు చెంతకే చేరుస్తుందన్నారు. జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలను విశ్లేషించగా నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

News January 22, 2026

ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు

image

పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రూల్స్‌ను కఠినం చేసింది. ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సును రద్దు లేదా 3 నెలల పాటు సస్పెండ్ చేయనుంది. గతంలో సీరియస్ ఉల్లంఘనల్లో ఇది ఉండేది. కానీ ఇపుడు హెల్మెట్, సీట్ బెల్ట్, రెడ్ లైట్ జంపింగ్ వంటి అంశాలకూ వర్తించనుంది. JAN 1 నుంచే అమల్లోకి తెస్తూ కేంద్రం చట్టాన్ని సవరించింది.

News January 22, 2026

NLG: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కేతెపల్లి మండలంలోని కొర్లపాడు సమీపంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం పాదచారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. చిత్రంలోని వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే కేతపల్లి ఎస్సై (ఫోన్‌: 8712670180)కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.