News August 25, 2024
సదాశివనగర్: విష జ్వరంతో బాలిక మృతి

సదాశివనగర్ మండలం భూంపల్లికి చెందిన మాన్యశ్రీ(12) విష జ్వరంతో శనివారం మృతి చెందినట్లు మండల ప్రాథమిక కేంద్రం వైద్యురాలు అస్మా తెలిపారు. బాలిక రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడటంతో కామారెడ్డికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. గ్రామంలో వరుసగా ఇద్దరు విషజ్వరాలతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
Similar News
News January 19, 2026
నిజామాబాద్: ఈనెల 20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు

నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణుల గణన ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ గణనలో పులులు, చిరుతలు, జింకలు, నెమళ్లు, అడవి పందులు తదితర వన్యప్రాణుల సంఖ్యను లెక్కించనున్నారు. సిరకొండ, కమ్మర్పల్లి, ఇందల్వాయి, వర్ని, ఆర్మూర్, నిజామాబాద్ రేంజ్ పరిధిలో ఈ గణన చేపట్టనున్నారు. గణన ఫలితాల ఆధారంగా అటవీ సంరక్షణ, భద్రత చర్యలు మరింత బలోపేతం చేయనున్నారు.
News January 19, 2026
సాలూర వాసికి పుడమి పుత్ర-రైతు మిత్ర అవార్డు

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న సాలూరకు చెందిన రైతు గంగారాం పుడమిపుత్ర-రైతుమిత్ర జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కేజీ గంగారం సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు దక్కడంపై సాలురా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
News January 19, 2026
సాలూర వాసికి పుడమి పుత్ర-రైతు మిత్ర అవార్డు

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న సాలూరకు చెందిన రైతు గంగారాం పుడమిపుత్ర-రైతుమిత్ర జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కేజీ గంగారం సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు దక్కడంపై సాలురా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


