News April 13, 2025

సన్నబియ్యం దారి మల్లిస్తే చర్యలు: ఖమ్మం CP

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం దారి మళ్లించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. ప్రజలు దొడ్డు బియ్యం తినలేకపోతున్నారనే ఆలోచనతో ఎంతో ఖర్చుతో సన్న బియ్యం పథకం అమలు చేస్తుంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటింటికి తిరిగి సన్నబియ్యం కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలు సేకరించాలని పోలీసులను ఆదేశించారు.

Similar News

News January 23, 2026

వసంత పంచమి వేడుకలు ఎలా చేసుకోవాలంటే..

image

వసంత పంచమి వేడుకల్లో పసుపు రంగుకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రజలు తెల్లవారునే లేచి, పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ పూజ చేస్తారు. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి పంచుకుంటారు. కొందరు శివపార్వతులను పూజిస్తారు. మరికొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందులు ఆరగిస్తూ, పాటలతో, నృత్యాలతో ఈ వసంత ఆగమనాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

News January 23, 2026

నేడు వికారాబాద్‌‌లో స్పీకర్‌ను కలవొచ్చు

image

నేడు తెలంగాణ శాసనసభపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ రానున్నారు ఉ. 10:00 గం.కు హైదరాబాద్ మినిస్టర్ కోటర్స్ నుంచి వికారాబాద్ బయలుదేరుతారు. 12:00 గం.కు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

News January 23, 2026

ఏలేశ్వరం: విద్యుత్ వినియోగదారులకు గమనిక

image

ఏలేశ్వరం మండలంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యలో 2 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరభద్రరావు అన్నారు. సబ్ స్టేషన్‌లో ఫిడర్లపై స్విచ్ అరేంజ్ చేయుటకు, లక్ష్మీపురం, గొంటువానిపాలెం, తిమ్మాపురం బద్రవరం, పేరవరం, ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో కొన్ని ఏరియాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని దీనిని ప్రజలు గమనించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు.