News November 19, 2025

సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

image

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.

Similar News

News January 23, 2026

ఖమ్మంలింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: డీఎంహెచ్‌ఓ

image

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రామారావు హెచ్చరించారు. శుక్రవారం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చట్టవిరుద్ధంగా పరీక్షలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్ల నమోదు, రెన్యూవల్ కోసం వచ్చిన 24 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

News January 23, 2026

147పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్<>(SAMEER<<>>)లో 147 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (JAN 25) ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MSc, BSc, డిప్లొమా, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://sameer.gov.in/

News January 23, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ‘త్వరలోనే ఎర్రబెల్లికి NOTICE’

image

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సిట్ నోటీసులు ఇస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు అన్నారు. రాయపర్తిలో వార్ రూం ఏర్పాటు చేసి అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతూ.. సినిమా నటీమణులతో డాన్సులు వేయించారన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డాడని, అందుకే సిట్ ఆయనను విచారిస్తోందని MLA చెప్పుకొచ్చారు.