News August 20, 2025
సింగరేణిలో ప్రభుత్వం తొలి విజయం సాధించింది: CMD

కర్ణాటక దేవ దుర్గ్లోని బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75% రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్-1 బిడ్డర్గా నిలిచినట్లు సీఎండీ బలరామ్ తెలిపారు. తద్వారా కీలక ఖనిజ అన్వేషణలో సింగరేణి శుభారంభం చేసినట్లు అయిందన్నారు. సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నంలో తొలి విజయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 23, 2026
VJA: ఉద్యోగం పేరిట రూ.12 లక్షల టోకరా.. నిందితుల అరెస్ట్!

ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్న అంతర్ జిల్లా మోసగాళ్ల ముఠాను అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. రోలుగుంటకి చెందిన ఓ మహిళకు DSCలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, ప్రకాశం(D)కు చెందిన శ్రీను, VJAకు చెందిన షేక్ సలీం అనే వ్యక్తులు ఆమె వద్ద నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
News January 23, 2026
RCBని కొనుగోలు చేయనున్న అనుష్క?

RCB ఫ్రాంచైజీలో వాటా దక్కించుకోవడానికి విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆమె బిడ్ వేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. రూ.400 కోట్లు వెచ్చించి 3% వాటా కొనాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం కోహ్లీ RCB తరఫున ఆడుతున్నారు. అటు ఈ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేస్తానని అదర్ పూనావాలా <<18930355>>ఇప్పటికే<<>> ప్రకటించారు.
News January 23, 2026
మంచిర్యాల: ముగిసిన నూతన సర్పంచులు శిక్షణా తరగతులు

ఐదు రోజులుగా కొనసాగిన నూతన సర్పంచుల శిక్షణా తరగతులు ఈరోజు ముగిశాయి. జిల్లా స్థాయిలో నూతన సర్పంచులకు ముల్కల వద్ద స్థానిక కళాశాలలో ఈనెల 19వ తేదీ నుంచి ఈరోజు వరకు శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో సర్పంచులకు గ్రామ పరిపాలన, గ్రామ అభివృద్ధి, ప్రజాపాలన, గురించి శిక్షణ ఇచ్చారు.


