News May 7, 2025
సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

ఈనెల 30న జరగనున్న సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై కలెక్టర్ ఛాంబర్లో మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్, ఆరోగ్య కేంద్ర శిబిరాలు, అన్న ప్రసాదం మంచినీరు వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ, దేవస్థానం ఈవో సుబ్బారావు ఉన్నారు.
Similar News
News February 16, 2026
సాంయంత్రం 6 దాటాకే ఆర్కే బీచ్కు అనుమతి..

విశాఖ బీచ్ రోడ్డులో ఈనెల 16, 17 తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ICP-2026 ప్రాక్టీస్ పరేడ్ జరగనుంది. ఈ సమయంలో సముద్రం వైపు ఉన్న సగం రోడ్డును నేవీకి కేటాయించారు. ఎన్టీఆర్ సర్కిల్, పార్క్ హోటల్ జంక్షన్ల వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు. సందర్శకులు సాయంత్రం 6 గంటల తర్వాతే బీచ్కు రావాలని పోలీసులు కోరారు.
News February 15, 2026
మెరుగైన ర్యాంకు కోసం GVMC కసరత్తు

స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 సర్వే నేపథ్యంలో నగర ర్యాంకు మెరుగుదలపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే నెల ఢిల్లీ బృందం పరిశీలనకు రానుంది. దీంతో జీవీఎంసీ పర్యవేక్షణను పెంచి సిబ్బంది పనితీరును సమీక్షిస్తోంది. పారిశుద్ధ్య లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అవగాహన కార్యక్రమాలతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ, మెరుగైన ర్యాంకే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News February 15, 2026
రుషికొండ బీచ్లో బీటెక్ విద్యార్థి మృతి

రుషికొండ బీచ్లో మునిగి యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విశాఖలో బీటెక్ చదువుతున్న అరవింద్( 21) తన స్నేహితులతో కలిసి బీచ్కు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తుండగా.. అరవింద్తో పాటు రాజీవ్ సముద్రంలో కొట్టుకొనిపోయారు. వెంటనే స్పందించిన లైఫ్ గార్డ్స్ వారిని ఒడ్డుకి తీసుకొచ్చారు. అప్పటికే అరవింద్ చనిపోయాడు. రాజీవ్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.


