News September 10, 2025

సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ఎప్పుడో..?

image

సింహాచలం ఆలయానికి ట్రస్ట్ బోర్డు లేకపోవడంతో అధికారుల ఏకచత్రాధిపత్యం నడుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. దేవస్థాన పాలనలో ట్రస్ట్ బోర్డు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత అనువంశిక ఛైర్మన్ అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబం నుంచి కొత్తవారికి అవకాశం ఇస్తారా?లేక ఆయనే కొనసాగుతారా అన్నది ఆసక్తిగా మారింది. అటు ట్రస్ట్ బోర్డులో చోటు కోసం పలువురు కూటమి నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Similar News

News December 13, 2025

విశాఖలో అల్లూరి జిల్లా యువకుడి అనుమానాస్పద మృతి

image

కూర్మన్నపాలెం నిన్న అల్లూరి(D) జీకేవీధికి చెందిన విజయ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. కార్ల వాషింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న అతను తన ప్రియురాలిని ఇక్కడికి రమ్మనగా..ఆమె మరో ఇద్దరు మహిళలతో వచ్చింది. వారంతా విజయ్‌కు యజమాని ఇచ్చిన రూమ్‌లో ఉన్నారు. అయితే తర్వాత యజమాని ఖాళీ చేయమనడంతో మహిళలు వెళ్లిపోయారు. ఆ సాయంత్రం రూమ్‌లో విజయ్ మృతి చెంది ఉన్నాడు. ఆ మహిళల ఫోన్లు కలవడం లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News December 13, 2025

SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్

image

<<18500647>>RBI<<>> రెపో రేటును 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో SBI కూడా రుణ రేట్లను సవరించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేటు(EBLR)ను 7.90 శాతానికి కుదించింది. MCLRను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70 శాతానికి చేరింది. అలాగే 2-3 ఏళ్ల వ్యవధి FD రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి, 444 రోజుల కాలవ్యవధి రేటును 6.45 శాతానికి పరిమితం చేసింది. ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయంది.

News December 13, 2025

మాచర్ల : ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి

image

మాచర్ల పట్టణంలో ఓ వ్యక్తి శుక్రవారం సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు పట్టణంలోని కోడెల శివప్రసాదరావు కాలనీకి చెందిన ఆటో‌డ్రైవర్‌ వెంకట పేరయ్య(35)గా పోలీసులు గుర్తించారు. వేరే ఇంటిలో సూసైడ్‌ చేసుకోవడంతో అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.