News August 20, 2025
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఆర్కే రోజా

సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహ స్వామిని మాజీ మంత్రి రోజా కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి కప్పస్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి వారి దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వాదం అందజేసి స్వామి వారి చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి, ఐశ్వర్యం కలగాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.
Similar News
News January 21, 2026
మాతృ మరణాల నివారణకు పకడ్బందీ చర్యలు: DMHO

విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు ఆధ్వర్యంలో మాతృ మరణాలపై సమావేశం జరిగింది. మూడు నెలల్లో నమోదైన మాతృ మరణాలపై ఆయన చర్చించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి, మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్, వీజీహెచ్కు పంపాలని, సురక్షిత ప్రసవాలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
News January 21, 2026
విశాఖలో DSPCA సమావేశం

విశాఖ జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి అధ్యక్షతన జిల్లా జంతు క్రూరత్వ నివారణ కమిటీ (DSPCA) సమావేశం జరిగింది. వీధి కుక్కల నియంత్రణకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు (ABC), సింహాచలం దేవస్థాన కోడెల సంరక్షణపై సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను జేసీ ఆదేశించారు.
News January 21, 2026
విశాఖ: ‘రోజుకు 300 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి’

పేదల గృహ నిర్మాణాల పరిస్థితిపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హౌసింగ్ అధికారులు, జోనల్ కమిషనర్లతో సమీక్ష చేసి ఏఏ ప్రాంతాల్లో నిర్మాణాలు ఏ మేరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకున్నారు. రోజుకు 300 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.


