News August 13, 2025
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కానిస్టేబుల్ మృతి

సూసైడ్ అటెంప్ట్కు పాల్పడిన కానిస్టేబుల్ తూము కిరణ్బాబు(40) ఈరోజు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిరణ్ 2017లో మీర్చౌక్ PSలో పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. తిరిగి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఈనెల4న పెట్రోల్ పోసుకొని సూసైడ్కు యత్నించాడు. 60% కాలిన గాయాలతో గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. తమను ఆదుకోవాలని భార్య, ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Similar News
News March 16, 2026
10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మృతి

కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.
News March 16, 2026
NLG: రాజగోపాల్రెడ్డి రహస్య మీటింగ్ పెట్టారా?

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను దుమారం రేగింది. రేవంత్ సర్కార్పై అసహనంతో ఉన్న మునుగోడు MLA రాజగోపాల్రెడ్డి ఒక రహస్య డిన్నర్ మీటింగ్ నిర్వహించారని, 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందగా అందులో నలుగురు వచ్చారని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. అయితే రాజగోపాల్ రెడ్డి రహస్య మీటింగ్ పెట్టారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. దీనిపై MLA రాజగోపాల్ రెడ్డి స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
News March 16, 2026
NZB: ఫీజులు లక్షల్లో.. భోజనం నరకప్రాయం

ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న ఆహారంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు భోజనం విషయంలో నాణ్యత పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. మెనూ ప్రకారం బ్రేక్ఫాస్ట్ అందించకుండా, ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం తిండితో అనారోగ్యం పాలవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


