News July 18, 2024
సికింద్రాబాద్: ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్లాట్ ఫామ్ నంబర్-3లో కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 6, 2025
ఓయూ: వివిధ డిగ్రీ కోర్సుల పరీక్ష ఫీజు ఖరారు

OU పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల అన్ని విభాగాల BA, B Com, BSc, BBA కోర్సుల నాలుగు, ఆరు రెగ్యులర్ సెమిస్టర్, మొదటి, ఆరో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షా ఫీజులను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 వరకు ఎలాంటి లేట్ఫీ రుసుము లేకుండా కాలేజీలో చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను www.osmania.ac.inలో సందర్శించాలన్నారు.
News February 6, 2025
పెద్దఅంబర్పేట్లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

పెద్దఅంబర్పేట్లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.
News February 6, 2025
శంషాబాద్లో హైడ్రా కూల్చివేతలు.. క్లారిటీ

శంషాబాద్లో కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. రాళ్లగూడ విలేజ్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా 55 మీటర్ల మేర ప్రహరీ నిర్మించారు. సర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా చేశారని రాళ్లగూడ విలేజ్ పరిసర ప్రాంతాల లేఔట్ల నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.