News May 2, 2024
సిద్దిపేటను అవమానించిన సీఎం రేవంత్: హరీశ్రావు

సిద్దిపేట అంటే సీఎం రేవంత్రెడ్డికి మొదటి నుంచి చిన్న చూపేనని మాజీ మంత్రి, సిద్దిపేట MLA హరీశ్రావు పేర్కొన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నిక ఓట్లు, సీట్లు, అధికారం కోసం జరిగేది కాదని తెలంగాణ భవిష్యత్ కోసం జరిగే ఎన్నిక అన్నారు. తెలంగాణ తెచ్చింది మన సిద్దిపేట బిడ్డ KCR అని, అలాంటి KCRను సీఎం రేవంత్రెడ్డి ఇష్టారీతిన తిడుతున్నాడని, కేసీఆర్ను తిట్టడం అంటే మన సిద్దిపేట ప్రజలను అవమాన పర్చడమే అన్నారు.
Similar News
News December 12, 2025
మెదక్: రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్, 163 BNSS అమల్లో ఉంటాయని చెప్పారు. ర్యాలీలు, ప్రచారం, గుమిగూడడం పూర్తిగా నిషేధం. ఎన్నికలు శాంతియుతంగా జరుగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
News December 12, 2025
మెదక్లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్ పూర్తి

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రెండో, మూడో విడతల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసిన సిబ్బందికి, ముఖ్యంగా పెద్ద ఎత్తున పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముందు విడతల మాదిరిగానే 14, 17 తేదీల పోలింగ్ను నిర్వహించేందుకు అధికారులను కలెక్టర్ సూచించారు.
News December 11, 2025
మెదక్: ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సందర్శన

మెదక్ జిల్లా మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల సందర్బంగా పెద్ద శంకరంపేట, రేగోడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ సందర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. మొదటి విడత మాదిరిగానే రాబోయే రెండు, మూడు విడతల్లో పారదర్శకంగా పనిచేయాలన్నారు.


