News April 13, 2025
సిద్దిపేట: అదుపుతప్పిన కారు.. బాలుడు మృతి

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన కుకునూరుపల్లి మండల పరిధి లకుడారం గ్రామ శివారులో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాలు.. హైదరాబాద్కు చెందిన రాయవరం బాబి కుటుంబ సమేతంగా వేములవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా లకుడారం శివారులో మల్లన్నవనం సమీపంలోని రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పి పల్టీలుకొట్టి బోర్లాపడింది. ఫలితంగా కార్తీక్(7) మరణించగా మిగతా నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు.
Similar News
News January 20, 2026
పెళ్లికి ముందు రక్తపరీక్షలు ఎందుకంటే?

ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం కోసం, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం పెళ్లికి ముందే జంటలు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హెచ్ఐవీ, హెపటైటిస్ B, C, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లు, Rh ఫ్యాక్టర్ను గుర్తించడానికి రక్త పరీక్షలు కీలకం. భవిష్యత్తును ఆరోగ్యకరంగా, సంతోషంగా ప్లాన్ చేసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని ప్రతిఒక్కరూ గుర్తించాలి.
News January 20, 2026
గద్వాల్: మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు

గద్వాల్ జిల్లాలో మహిళ రైతు ఉత్పత్తిదారుల కంపెనీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీఓ నరసింగరావు తెలిపారు. అలంపూర్ బాల బ్రహ్మేశ్వర ఉమెన్ FPCలో CEO–01 (జీతం రూ.15,000), మల్దకల్ జోగులాంబ ఉమెన్ FPCలో అకౌంటెంట్–01 (జీతం రూ.6,000) పోస్టులు ఉన్నాయి. అర్హతలతో కూడిన దరఖాస్తులు ఈనెల 27 సాయంత్రం 5 గంటలలోపు కలెక్టర్ కార్యాలయం రూం నం. F-29లో అందజేయాలన్నారు.
News January 20, 2026
భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలి- కలెక్టర్

భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించి ప్రజలకు సుపరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రెవెన్యూ క్లినిక్లు, రీ-సర్వే, మ్యుటేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి నూటికి నూరు శాతం పరిష్కారం చూపాలన్నారు.


