News December 2, 2025

సిద్దిపేట: ఈ మండలాల్లో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

image

సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడత నామినేషన్లు రేపటి నుంచి స్వీకరించనున్నారు. జిల్లాలో 9 మండలాలు అక్కన్నపేట, చేర్యాల, దూల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరులో మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా మొదటి, రెండవ విడత నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమై మొదటి విడత నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. రెండో విడత నామినేషన్లు 3న ముగియనున్నాయి.

Similar News

News February 18, 2026

రోజూ 10 నిమిషాలు ఎండలో ఉంటే..

image

రోజుకు 10 నిమిషాలైనా ఎండలో ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘సూర్యరశ్మి వల్ల విటమిన్-D పెరుగుతుంది. ఇది ఎముకల బలానికి అవసరమైన కాల్షియంను గ్రహించడానికి సాయపడుతుంది. మూడ్‌ని మార్చేసి, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. నిద్ర బాగా పడుతుంది. రోజంతా ఎనర్జీతో ఉండేలా చేస్తుంది. చర్మంలోని నైట్రిక్ ఆక్సైడ్‌ విడుదలయ్యేలా చేస్తుంది. ఇది రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది’ అని చెబుతున్నారు.

News February 18, 2026

రీసర్వే వేగవంతం చేయండి: శ్రీకాకుళం కలెక్టర్

image

రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని, రికార్డుల్లో వ్యత్యాసాలను సరిదిద్దాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. 4వ దశ రీసర్వే 167 గ్రామాల్లో జరుగుతోందని,24 గ్రామాల్లో పూర్తయిందన్నారు. weblandలో ఇతరుల పేరిట ఉన్న భూముల వివరాలు పరిశీలిస్తే 29,953 సర్వే నంబర్లలో తప్పులున్నాయని, వాటిపై దృష్టి సారించాలన్నారు.

News February 18, 2026

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు!

image

TG: 2025-2028కు సంబంధించి ప్రైవేటు ఇంజినీరింగ్ ఫీజులను రాష్ట్ర అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(TAFRC) ఖరారు చేసింది. 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయించింది. 63 కళాశాలల్లో పెంచగా, 19 కాలేజీల్లో తగ్గించింది. ఓ సంస్థలో అత్యధికంగా ₹62 వేలు పెరిగింది. CBITలో అత్యధికంగా ₹1.83 లక్షల ఫీజు ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి ఈ మేరకు TAFRC నివేదిక పంపింది. త్వరలో జీవో వచ్చే అవకాశం ఉంది.