News February 8, 2025
సిద్దిపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

సిద్దిపేట జిల్లా చేగుంట, గజ్వేల్ రహదారి పై నర్సపల్లి చౌరస్తా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మృతులు దౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. రోడ్డు దాటుతున్న బైక్ను లారీ ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2026
ఆధార్లో ఇంటి అడ్రస్ను ఈజీగా మార్చుకోండి!

ఇల్లు మారినప్పుడల్లా అడ్రస్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారా? ఇక ఆ అవసరం లేదు. ఆధార్ మొబైల్ <<18981041>>యాప్<<>> ద్వారా మీ హౌస్ అడ్రస్ను సులభంగా మార్చుకోవచ్చు. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే సరిపోతుంది. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే సులభంగా, వేగంగా ఈ సేవను పొందొచ్చు. యూజర్లు ₹75+GST చెల్లించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. SHARE IT
News February 12, 2026
శని త్రయోదశి ప్రత్యేక పూజ

కెరీర్లో సమస్యలా? ఏ పని దిగ్విజయంగా పూర్తి చేయలేకపోతున్నారా? అయితే మీకు శని త్రయోదశి పూజ సరైంది. శని త్రయోదశి రోజున నిర్వహించే ఈ ప్రత్యేక పూజ మీ శని దోషాలను తగ్గించడమే కాకుండా జీవితంలో సత్ఫలితాలను ఇస్తుంది. తైలాభిషేకంతో కూడిన అర్చనతో శని దేవుడి అనుగ్రహం కూడా పొందవచ్చు. మీ పేరు, గోత్రంతో నిర్వహించే పూజ పూర్తి వీడియో రికార్డింగ్ను 24 గంటల్లో మీకు పంపిస్తాం. వేదమందిర్లో ఇప్పుడే <
News February 12, 2026
ASF: మున్సిపల్ ‘కౌన్సిలర్ల’ క్యాంపు రాజకీయం!

ASF మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, BRS మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో హ్యాంగ్ ఫలితాల భయంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. ఛైర్మన్ అభ్యర్థి రాపర్తి రవి, చిలువేరు వెంకన్న మినహా మిగిలిన 18 మంది అభ్యర్థులను బెంగళూరు క్యాంపునకు తరలించినట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీ ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతోనే ర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


