News March 6, 2025
సిద్దిపేట: తండ్రి మరణం.. ‘కూతురికి పరీక్ష’

తండ్రి చనిపోయిన బాధలోనూ ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్ష రాసిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వర్గల్కు చెందిన పసుల లింగం(50) బైక్పై తూప్రాన్ వెళ్లి వస్తుండగా నాచారం వద్ద గజ్వేల్ తూప్రాన్ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. లింగం కూతురు తేజశ్రీ బుధవారం తండ్రి చనిపోయిన బాధ దిగమింగి ఇంటర్ తొలి రోజు పరీక్ష రాసింది. ఎగ్జామ్ రాసి వచ్చిన అనంతరం తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది.
Similar News
News December 8, 2025
MDK: బ్యాలట్ బాక్స్ సీల్, సౌకర్యాల తనిఖీపై అబ్జర్వర్ కీలక సూచనలు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్లు విధులలో నిబద్ధతతో పనిచేయాలని జిల్లా సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ సూచించారు. ఐడీఓసీ సమావేశ హాల్లో శిక్షణా కార్యక్రమంలో 82 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించడం, సమస్యాత్మక కేంద్రాల్లో తనిఖీలు, బ్యాలట్ బాక్స్ సీల్, సౌకర్యాల పరిశీలన, రిపోర్ట్ సమర్పణలపై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.
News December 8, 2025
మెదక్: చెక్పోస్టును సందర్శించిన ఎన్నికల అబ్జర్వర్

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యయ, మద్యం నియంత్రణ చేయాలని ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ సూచించారు. సోమవారం మంబోజిపల్లి వద్ద చెక్పోస్టును సందర్శించారు. వాహనాల తనిఖీలు, నగదు, వస్తువుల రవాణా, అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను పరిశీలించారు. చెక్పోస్టుల్లో అప్రమత్తత, సమన్వయం, సమాచార అంశాలపై పలు సూచనలు చేశారు.
News December 8, 2025
మెదక్: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు జిల్లా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను ఎస్పీకి వివరించారు. ఆయన ఫిర్యాదుదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి, వెంటనే సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


