News February 10, 2025
సిద్దిపేట: మోతేలో ఒకేరోజు ఐదుగురు మృతి

అక్బర్పేట మండలం మోతే గ్రామంలో ఇవాళ ఒక్క రోజే 5 మంది చనిపోవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని నెలలుగా గ్రామంలో పలువురు చనిపోయారని.. ఇవాళ అనారోగ్యంతో దేవుని మల్లమ్మ(79), బాలకృష్ణయ్య(68), నరసవ్వ(63), మల్లేశం(55), చెరువులో పడి కాలేరు వెంకటేశం(71) చనిపోయారు. ఈ గ్రామం శవాలుగా మారుతోందని.. ఈ ఊరికి ఏమైందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News February 19, 2026
ఆ షుగర్ టెస్టుపైనే ఆధారపడొద్దు: లాన్సెట్

షుగర్ లెవల్స్ చెక్ చేసేందుకు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్న HbA1c టెస్టునే ప్రామాణికంగా తీసుకోవద్దని లాన్సెట్ జర్నల్ సూచించింది. ఈ టెస్టులో ఎర్రరక్త కణాల్లో (RBC) కలిసే చక్కెర స్థాయి లెక్కిస్తారు. అయితే ‘రక్తహీనత, ఇతర బ్లడ్ సమస్యలు సాధారణమైన భారత ప్రజల్లో RBCలు విచ్ఛిన్నం అవుతాయి. దీంతో ఎక్కువ కణాలు ఉన్నట్లు కన్పించి ఫలితం తప్పుగా వస్తోంది. ఫలితంగా డయాబెటిస్ ఉన్నా, తెలియడం లేదు’ అని పేర్కొంది.
News February 19, 2026
నెల్లూరు: టన్నుల్లో కవర్లు.. దొరికేది కేజీల్లోనే

నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా విక్రయాలు ఆగడం లేదు. సిటీలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ నిల్వలు ఉన్నా అధికారులు మంగళవారం 400 కేజీలే పట్టుకోవడం గమనార్హం. విక్రయదారులకు రూ.1.40 లక్షల ఫైన్ వేశారు. కొండాల్ని తవ్వి ఎలుకను పడుతున్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. కవర్ల తయారీ కంపెనీలపై దాడు చేయాలని కోరుతున్నారు.
News February 19, 2026
నెల్లూరు: టన్నుల్లో కవర్లు.. దొరికేది కేజీల్లోనే

నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా విక్రయాలు ఆగడం లేదు. సిటీలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ నిల్వలు ఉన్నా అధికారులు మంగళవారం 400 కేజీలే పట్టుకోవడం గమనార్హం. విక్రయదారులకు రూ.1.40 లక్షల ఫైన్ వేశారు. కొండాల్ని తవ్వి ఎలుకను పడుతున్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. కవర్ల తయారీ కంపెనీలపై దాడు చేయాలని కోరుతున్నారు.


