News March 8, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి..

image

సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధి చిన్న కిష్టాపూర్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపల్ డీఎస్పీ జవహర్ లాల్(50) చికిత్స పొందుతూ మృతిచెందారు. కార్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. జవహర్ లాల్ కారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కారు అదుపు తప్పి ఇనుప బోర్డ్‌కు ఢీ కొట్టింది.

Similar News

News January 24, 2026

కెనడాను చైనా మింగేస్తుంది: ట్రంప్

image

చైనాతో వ్యాపారం చేస్తే కెనడాకే ప్రమాదమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు మద్దతివ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కెనడా వ్యతిరేకిస్తోంది. నిజానికి అది వారి దేశాన్ని కూడా రక్షిస్తుంది. దానికి బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకే మొగ్గు చూపుతోంది. నిజానికి కెనడాని చైనా ఏడాదిలోనే మింగేస్తుంది’ అని పేర్కొన్నారు.

News January 24, 2026

పారిశ్రామిక అభివృద్ధికి భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టీజీఐఐసీ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు భూసేకరణ పూర్తయిన భూముల రికార్డు మ్యాపులను సిద్ధం చేయాలని చెప్పారు. రైతులకు చెల్లించిన పరిహారం వివరణపై పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు.

News January 24, 2026

కామారెడ్డి: జిల్లాలో ‘బీసీ’లకే అగ్రపీఠం!

image

పురపాలక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలకు ప్రాధాన్యత లభించింది. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు జిల్లాలో బీసీల రాజకీయ ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో మూడు స్థానాలను బీసీలకు కేటాయించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో రాజకీయంలో అనుభవం ఉన్న ఆశావాహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.