News December 1, 2025
సిద్దిపేట: సప్లమెంటరీ నోటిఫికేషన్ విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ స్టడీ పీజీ సెకండియర్, ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు స్పెల్ 2 సప్లమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 జనవరి 20 నుంచి 31 వరకు జరుగుతాయని, విద్యార్థులు ఫీజును డిసెంబర్ 22లోపు www.braouonline.in ఆన్లైన్లో చెల్లించాలని సిద్దిపేట రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం తెలిపారు.
Similar News
News February 10, 2026
ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు.. ఎస్పీ హెచ్చరిక

మున్సిపల్ ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే 123 కేసులు నమోదు చేసి సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 208 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. 30 కేసుల్లో రూ.1.57 లక్షల విలువైన 249 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News February 10, 2026
టీనేజ్ ప్రెగ్నెన్సీలో ‘రెడ్జోన్’లో కర్నూలు

కర్నూలు జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ శాతం 12కుపైగా నమోదు కావడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ విషయంలో జిల్లా రెడ్ జోన్లో ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. దీనిపై అవగాహన పెంచి, బాల్య వివాహాలను అరికట్టాలని సీఎం ఆదేశించారు. నంద్యాల జిల్లాలోనూ 10 నుంచి 12 శాతంగా టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నాయి.
News February 10, 2026
చిత్తూరు జిల్లాలో కష్టంగా పశుపోషణ…!

చిత్తూరు జిల్లాలో చలికాలం కావడంతో పశుపోషణ రైతులకు తీవ్ర భారంగా మారింది. చలి కారణంగా పచ్చి గడ్డి త్వరగా పెరగడం లేదు. పశువుల మేతకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు ఎండు గడ్డిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గడ్డి మోపు ధర ఒక్కటి రూ.300 వరకు పలుకుతోంది. దీంతో రైతులు పశువులను పోషించడమే భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల రేట్లు తక్కువగా ఉండటంతో పశుపోషణ కష్టంగా మారింది.


