News December 2, 2025
సిరిసిల్ల: అందని సర్టిఫికెట్లు.. ఉత్కంఠలో అభ్యర్థులు

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు కులం, ఆదాయం సర్టిఫికెట్లు పెద్ద సవాలుగా మారింది. సర్వర్ పని చేయకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. మ్యాన్యువల్గా సర్టిఫికెట్లు జారీచేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మూడో విడత నామినేషన్లు రేపటి నుంచే మొదలుకానున్నాయి. సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడంతో అనుకున్న ముహుర్తానికి నామినేషన్ వేస్తామో లేదో అని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 13, 2026
విషాదం, శుభకార్యాల సమయాల్లో లోన్ రికవరీ వద్దు: RBI

రుణాలు తీసుకున్న వారి ఇళ్లలో విషాదం చోటుచేసుకున్నప్పుడు లేదా శుభ కార్యాలు జరిగే సమయాల్లో లోన్ రికవరీ చేయొద్దని RBI బ్యాంకులను ఆదేశించింది. ‘రుణ రికవరీ విధానం అన్ని బ్యాంకుల్లో ఒకేరీతిన ఉండాలి. నిర్దేశిత రూల్స్ ప్రకారం ఏజెంట్ల నియామకం చేపట్టాలి. రికవరీ కోసం వారు చేసే ఫోన్ కాల్స్ను రికార్డు చేయాలి’ అని పేర్కొంది. రుణగ్రహీతల డేటాను ఉద్యోగులు, ఏజెంట్లు దుర్వినియోగం చేయకుండా చూడాలని సూచించింది.
News February 13, 2026
పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి: విలియం కటింగ్

జమ్మలమడుగు పట్టణంలోని సీఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ను పూర్వ వైద్యుడు డాక్టర్ విలియం కటింగ్ సందర్శించారు. శుక్రవారం ఆయన హాస్పిటల్లోని ప్రతి వార్డులో తిరిగి తన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.1961-1973 నాటికి, ఇప్పటికీ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందిందని హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం 6.30కు ఫొటో ఆల్బమ్ విడుదల చేస్తామని హాస్పిటల్స్ సూపరిటెండెంట్ డాక్టర్ అగస్టిన్ రాజ్ తెలిపారు.
News February 13, 2026
వేములవాడ మున్సిపాలిటీలో హంగ్

వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. మొత్తం 28 వార్డులకు కాంగ్రెస్ 13 చోట్ల జయకేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 8 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ 5 వార్డులకే పరిమితమైంది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ ఛైర్పర్సన్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీకి మరొక కౌన్సిలర్ మద్దతు ఏర్పడింది.


