News August 14, 2025
సిరిసిల్ల: ‘అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం’

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.
Similar News
News March 17, 2026
బాపట్ల రైతులకు JC సూచనలు

రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1,73,384.540 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 28తో మూసివేస్తారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని 28 లోపు విక్రయించుకోవాలన్నారు.
News March 17, 2026
MBNR: ఎస్సీ యువతకు భారీ సబ్సిడీ రుణాలు

నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం రూ. 1 నుంచి రూ.7 లక్షల వరకు రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత తెలిపారు. దీనిపై 50% నుంచి 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 21-50 ఏళ్ల మధ్య వయస్సు వారు మార్చి 24లోపు TGOBMMS పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 98499 05996ను సంప్రదించవచ్చు.
News March 17, 2026
తాడేపల్లిగూడెం: ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్

తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్గా పనిచేస్తున్న రౌతు రామకృష్ణ మంగళవారం ఏసీబీ వలలో చిక్కారు. స్థలం సర్వే రిపోర్టుకు యజమాని నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. మున్సిపల్ సర్వేయర్, ఇంచార్జ్ డివిజనల్ సర్వేయర్గా పనిచేస్తూ రామకృష్ణ పలుమార్లు అవినీతికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వేయర్, సిబ్బంది, కుటుంబీకులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


