News September 10, 2025

సిరిసిల్ల: కోడెల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం

image

కోడెల పంపిణీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈనెల 14న ఉదయం 9 గంటలకు వేములవాడ మండలం తిప్పాపూర్లోని గోశాలలో కోడెలను పంపిణీ చేస్తామని వివరించారు. ఆసక్తి గలవారు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. https://rajannasircilla.telangana.gov.in/.

Similar News

News December 17, 2025

8,113పోస్టులు.. CBAT షెడ్యూల్ విడుదల

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది విడుదల చేసిన 8,113 <>NTPC<<>> పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ అందించింది. డిసెంబర్ 15న సీబీటీ 2 ఫలితాలు విడుదల చేయగా.. తాజాగా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్(CBAT)ను డిసెంబర్ 28న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్ నుంచి తీసుకోవచ్చని తెలిపింది. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in

News December 17, 2025

1147 22A భూ సమస్యలను పరిష్కరించాం: నాదెండ్ల

image

ఏలూరు జిల్లాలో వ్యాప్తంగా 22A భూ సమస్యల దరఖాస్తులు 1199 అందగా, వాటిలో 1147 దరఖాస్తులను పరిష్కరించామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మనోహర్ మంగళవారం తెలిపారు.142. 04 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించామన్నారు. మరో 32 ఎకరాలకు సంబంధించి 11 కేసులు పెండింగ్ ఉన్నాయని, వాటిలో 8 కేసులను వారంలోగా, 2 కేసులు 2 వారంలోగా పరిష్కారానికి చర్యలు, దేవాదాయ శాఖ సంబంధించిన ఒక కేసును నెలరోజుల్లోగా పరిష్కరించాలన్నారు.

News December 17, 2025

బుల్లెట్ రైలు ట్రాక్ కోసం Soil Test!

image

AP: బెంగళూరు-HYD, HYD-చెన్నై మార్గాల్లో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. HYD-చెన్నై మార్గం గుంటూరు జిల్లా.. బెంగళూరు-HYD మార్గం అనంతపురం జిల్లా మీదుగా వెళ్తుంది. ఇందులో భాగంగా నిన్న అనంతపురం(D) బుక్కరాయసముద్రం ఏరియాలో భూపరీక్షలు నిర్వహించింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు సిద్ధం చేస్తున్న గ్రౌండ్ రిపోర్టులో భాగంగానే భూపరీక్షలు చేసినట్లు తెలుస్తోంది.