News December 2, 2025
సిరిసిల్ల: నేడే రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ ఫైనల్స్

సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఫైనల్స్ 2వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు. బాలురు, బాలికల విభాగంలో జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా ఉదయం వేళలో సెమీఫైనల్స్ మ్యాచ్ లు ఉంటాయని, సెమీఫైనల్స్ విజేతల మధ్య సాయంత్రం వేళలో ఫైనల్స్ మ్యాచ్ నిర్వహిస్తామని జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకుమార్, కార్యదర్శి రాందాస్, రెఫరీ కమిటీ కన్వీనర్ రవీందర్ రెడ్డి తెలిపారు.
Similar News
News February 13, 2026
15 మంది బాలలకు విముక్తి: బాపట్ల కలెక్టర్

బాల కార్మిక నిర్మూలన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం తెలిపారు. జిల్లాలో బాల కార్మికులు ఉండరాదన్నారు. బాల కార్మికుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించడమే అధికారుల లక్ష్యం కావాలన్నారు. రెస్క్యూ బృందాలు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. 14 సంవత్సరాలలోపు బాలలంతా కచ్చితంగా పాఠశాలల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15 మంది బాలలకు విముక్తి కల్పించామన్నారు.
News February 13, 2026
GNT: రాజధాని రైతులకు ముఖ్య గమనిక

రాజధాని అమరావతి రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” శనివారం అనగా ఫిబ్రవరి 14న రద్దు చేస్తున్నట్లు CRDA అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్వహణ కారణాల రీత్యా రేపు గ్రీవెన్స్ డే జరగదని, రాజధాని ప్రాంతవాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News February 13, 2026
JIPMERలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

<


