News November 8, 2025
సిరిసిల్ల: ‘న్యాయ సేవాధికార సంస్థను వినియోగించుకోవాలి’

ఉచిత న్యాయ సహాయం కోసం న్యాయ సేవాధికార సంస్థను వినియోగించుకోవాలని, సమస్యలను శాంతియుతంగా, త్వరితంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. న్యాయ సేవల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
Similar News
News January 23, 2026
2 వారాలు షుగర్ మానేస్తే మ్యాజిక్ రిజల్ట్స్!

స్వీట్లు, కూల్ డ్రింక్స్ వంటి వాటిలోని చక్కెర మన బాడీని పాడు చేస్తోందని ఎయిమ్స్ డాక్టర్ సౌరభ్ సేథి చెప్పారు. కేవలం 14 రోజులు షుగర్ మానేస్తే అద్భుతమైన మార్పులు వస్తాయన్నారు. ‘ముఖంలో వాపు తగ్గి గ్లో వస్తుంది. ఇన్సులిన్ లెవల్స్ తగ్గి పొట్ట ఫ్లాట్గా మారుతుంది. ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మాయమవుతాయి. హెల్తీ స్కిన్ కోసం ఇదో బెస్ట్ టిప్’ అని సూచించారు.
News January 23, 2026
ఫిబ్రవరి నాటికి పనులు ప్రారంభం కావాలి: కలెక్టర్

పెండింగ్లో ఉన్న పీఎం కుసుమ్ పనులను ఫిబ్రవరి మొదటి వారం నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి విద్యుత్ శాఖ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కాంట్రాక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఏప్రిల్ నాటికి 23,000 సోలార్ ఇన్స్టాలేషన్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు.
News January 23, 2026
స్పేస్ అప్లికేషన్ సెంటర్లో 49 పోస్టులకు నోటిఫికేషన్

అహ్మదాబాద్లోని <


