News December 2, 2025
సిరిసిల్ల : పోస్టల్ బ్యాలెట్పై అధికారులకు శిక్షణ

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తహశీల్దార్లు, ఎంపీఓలు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లకు పోస్టల్ బ్యాలెట్పై శిక్షణ ఇచ్చారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ట్రైనర్లు మంగళవారం పీపీటీ ద్వారా శిక్షణ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
Similar News
News February 16, 2026
ఖమ్మం: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన

ప్రేమించి మోసం చేశారంటూ ఓ యువతి ఇంటి ముందు బైఠాయించిన ఘటన కూసుమంచి మండలం ముత్యాల గూడెం గ్రామంలో జరిగింది. బూర్గంపాడు మండలానికి చెందిన ఓ యువతి ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పగిళ్ల మనోజ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు నిరాకరించడంతో యువతి, కుటుంబ సభ్యులు మనోజ్ ఇంటిముందు బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News February 16, 2026
సంగారెడ్డి: పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.
News February 16, 2026
సన్నాలకు బోనస్.. రూ.514.36 కోట్లు విడుదల

TG: సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్వింటాల్కు రూ.500 బోనస్ కోసం రూ.514.36 కోట్లు విడుదల చేసింది. వానాకాలం సీజన్లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ఈ బోనస్ అదనంగా లభించనుంది.


