News February 6, 2025
సిరిసిల్ల: రైతులకు కిసాన్ APK లింక్.. రూ.లక్షన్నర మాయం

కిసాన్ ఏపీకే పేరిట వచ్చిన లింక్ ఓపెన్ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బులు మాయమయ్యాయి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల జమ వివరాలు తెలుసుకోవాలంటే ఈ యాప్ను ఇన్స్టాల్ చేయాలని కోనరావుపేటకు చెందిన ఇద్దరు, మంగళ్లపల్లికి చెందిన ఒక రైతు వాట్సాప్కు లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే ముగ్గురి ఖాతాల్లో నుంచి రూ.32 వేలు, రూ.57 వేలు, రూ.70 వేల చొప్పున కట్ అయ్యాయి. PSలో ఫిర్యాదు చేశారు.
Similar News
News January 18, 2026
గచ్చిబౌలిలో కనువిందు చేసిన డ్రోన్ ఫెస్టివల్

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘డ్రోన్ ఫెస్టివల్ 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రదర్శనను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఈ డ్రోన్ షోలో రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, పాలపిట్ట వంటి తెలంగాణ చిహ్నాలను ప్రదర్శించారు. ఆకాశంలో డ్రోన్లు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.
News January 17, 2026
బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి: బండి సంజయ్

TG: త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధికి నయాపైసా రాదని, బీఆర్ఎస్కు వేస్తే వృథాయేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
News January 17, 2026
జగిత్యాల: ‘ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం’

జగిత్యాల జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాయికల్, జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత పాల్గొన్నారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో BRS జెండా ఎగరడం ఖాయమని కోరుట్ల MLA కల్వకుంట్ల సంజయ్ అన్నారు.


