News December 1, 2025
సిరిసిల్ల: వాలీబాల్ టోర్నీలో సెమీఫైనల్స్ చేరిన జట్లు ఇవే

సిరిసిల్ల పట్టణంలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో బాలికల విభాగంలో నిజామాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జట్లు సెమీఫైనల్స్ కు చేరాయి. తొలి రెండు రోజులలో పది జిల్లాల జట్ల మధ్య 20 మ్యాచ్ లు నిర్వహించామని, ఇందులో నాలుగు జట్లు సెమీఫైనల్ చేరాయని రెఫరీ బోర్డు కన్వీనర్ రవీందర్ రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్ తెలిపారు.
Similar News
News February 12, 2026
RR: రేపే లెక్కింపు.. మధ్యాహ్నానికే ఫలితాలు!

మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. రేపు 64 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఇందుకోసం 254 మంది సిబ్బందిని నియమించారు. షాద్నగర్లో అత్యధికంగా 14, ఆమనగల్లో అత్యల్పంగా 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఫలితాలు వెల్లడించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఇన్ఛార్జ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
News February 12, 2026
సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్ బాధ్యతల స్వీకరణ

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు.
News February 12, 2026
నల్గొండ: మున్సిపల్ పోరులో ‘సింహం’ గర్జిస్తుందా?

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో AIFB అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల టికెట్లు దక్కని పలువురు నేతలు ‘సింహం’ గుర్తుపై పోటీకి దిగారు. మొత్తం 48 డివిజన్లలో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున 11 మంది బరిలో నిలవగా, ఐదుగురు అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్నారు. రేపు వెలువడనున్న ఫలితాల్లో సింహం గుర్తు ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని నగరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.


