News October 8, 2025

సిరిసిల్ల: సన్నవడ్ల BONUSపై ఆశలు గల్లంతేనా..?

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్న వడ్లకు బోనస్ వస్తుందనే ఆశలు ఆవిరవుతున్నాయని పలువురు రైతన్నలు పేర్కొన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో రైతన్నలు సన్న వడ్లను సాగు చేశారు. గత సీజన్లో ప్రభుత్వం 10 వేల క్వింటాళ్లకుపైగా సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు బోనస్ రాకపోవడంతో రైతులు దిగాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో కూడా సన్నాలను సాగు చేశారు.

Similar News

News January 17, 2026

వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టిన మరాఠా

image

అధికారం కోసం చేసే రాజకీయ విన్యాసాలను ప్రజలు తిరస్కరిస్తారనేందుకు MH మున్సిపల్ ఎన్నికలే తార్కాణం. 2023లో NCP చీలి బాబాయ్, అబ్బాయి శరద్, అజిత్ పవార్లు విడిపోయారు. తాజా ఎన్నికల్లో చేతులు కలిపారు. అటు అన్నదమ్ములు ఉద్ధవ్(శివసేన), రాజ్ ఠాక్రే(MNS)లు కూడా విభేదాలు పక్కనపెట్టి MNP ఎన్నికల్లో కలిసిపోయారు. కానీ వీరికి ఆశించిన ఫలితాలు రాలేదు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిద్దామనుకున్న వీరిని ప్రజలు ఆదరించలేదు.

News January 17, 2026

NZB: మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఇవే

image

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల మేయర్, ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. NZbమేయర్ పదవిని జనరల్ (మహిళ)కు, బోధన్ మున్సిపల్ ఛైర్మన్ అన్ రిజర్డ్వ్డ్‌కు రిజర్వ్ చేయగా ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఛైర్మన్ పదవులను జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.

News January 17, 2026

కడప టు ఢిల్లీ

image

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకొచ్చారు. భారత సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి భారత అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సంగీత నాటక అకాడమీ కేంద్రాలలో ప్రత్యేక రిహార్సల్ పొందుతున్నారు. ఏపీ నుంచి కూచిపూడి నృత్యానికి సంబంధించి 30 మందిని ఎంపికచేసింది.