News December 2, 2025
సీఎం పర్యటనకు 900 మందితో పోలీస్ భద్రత

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఒక అదనపు ఎస్పీ, డీఎస్పీ-5, సీఐలు-30, ఎస్సైలు-62, ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్ళు -300, హోంగార్డులు-160, 7 స్పెషల్ పార్టీలు, 2 ఏఆర్ ప్లాటున్లు మొత్తం 900 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News February 16, 2026
HYD: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్తో వీటిని భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్లో 10, HYD స్కార్ట్ డివిజన్లో 8, HYD సౌత్ ఈస్ట్ 16, సికింద్రాబాద్ డివిజన్లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం నెలకు రూ.12,000-29,380, వయసు 18-40 ఉండాలి.
News February 16, 2026
HYD: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్తో వీటిని భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్లో 10, HYD స్కార్ట్ డివిజన్లో 8, HYD సౌత్ ఈస్ట్ 16, సికింద్రాబాద్ డివిజన్లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం నెలకు రూ.12,000-29,380, వయసు 18-40 ఉండాలి.
News February 16, 2026
మెదక్: మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా: ఎస్పీ

మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, తూప్రాన్ మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో 163 BNSS ( సెక్షన్ 144) ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.


