News December 3, 2025
సీఎం పర్యటనను విజయవంతం చెయాలి: జేసీ

భామినిలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 5 తేదీ పర్యటనను విజయవంతం చెయ్యాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి కోరారు. మంగళవారం భామినిలో మన్యం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎవరికి కేటాయించిన పనులు వారు పక్కగా నిర్వహించాలని కోరారు. ప్రధానంగా విద్యుత్, రహదారులు, ట్రాఫిక్, మెడికల్ సర్వీసులు అందుబాటులో ఉండాలని, ప్రోటోకాల్ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.
Similar News
News February 17, 2026
ఇల్లందు ఛైర్మన్ ఎన్నిక.. ఏం జరిగిందంటే..

ఇల్లందు పుర పాలకవర్గం ప్రమాణస్వీకారం కోరం లేకపోవడంతో నేటికి వాయిదా పడింది. HYD క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్లు నిర్ణీత సమయానికి చేరుకోకపోవడమే ఇందుకు కారణం. కాగా మంగళవారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ముగిసింది. 24 స్థానాల్లో 21 మంది మద్దతుతో <<19165045>>కాంగ్రెస్కు పీఠం దక్కింది<<>>. BRS 3 స్థానాలకే పరిమితం కాగా, గెలిచిన స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులు హస్తం గూటికి చేరడంతో కాంగ్రెస్ విజయం ఖాయమైంది.
News February 17, 2026
IOCL 121పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

<
News February 17, 2026
హైదరాబాద్ గడ్డపై ప్రపంచ ప్యాకేజింగ్ ‘దంగల్’

64 ఏళ్ల ఐసీసీఏ (ICCA) చరిత్రలో తొలిసారి HYDకు గ్లోబల్ సమ్మిట్ ఆతిథ్యం దక్కింది. 2027 జనవరిలో జరిగే ఈ మెగా ఈవెంట్తో తెలంగాణ పేరు గ్లోబల్ ఇండస్ట్రియల్ మ్యాప్లో మారుమోగిపోనుంది. రూ.55 వేల కోట్ల విలువైన దేశీ ప్యాకేజింగ్ రంగానికి ఈ సదస్సు ఊపిరి పోయనుంది. హైదరాబాద్ దిగ్గజాలు ఎం.ఎల్. అగర్వాల్, అంకిత్ అగర్వాల్ సారథ్యంలో ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం. రేపు కర్టెన్ రైజర్ ఈవెంట్ జరుగుతోంది.


