News March 15, 2025
సీఎం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గ పర్యటనకు ఏర్పాట్లు పూర్తైనట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏర్పాట్లను పరిశీలించారు.
Similar News
News February 11, 2026
ట్రాఫిక్ చలాన్ల కోసం బ్యాంక్ అకౌంట్ లింక్? రవాణా శాఖ క్లారిటీ

TG: వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో చలాన్ల కోసం బ్యాంక్ ఖాతా వివరాలు సేకరిస్తున్నారనే ప్రచారంలో నిజం లేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. చలాన్ల కోసం రిజిస్ట్రేషన్ నంబర్లను లేదా ఓనర్ల బ్యాంక్ ఖాతాలను లింక్ చేసి, డబ్బులు ఆటోమేటిక్గా కట్ అయ్యేలా చేసే విధానం ఏదీ ప్రస్తుతం అమలులో లేదని వివరణ ఇచ్చింది. అలాంటి విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొంది.
News February 11, 2026
జగన్తో కలిసి నిరసన తెలిపిన అల్లూరి జిల్లా ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమవేశాలకు పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం హాజరయ్యారు. ముందుగా జగన్తో కలిసి అసెంబ్లీ బయట ఎమ్మెల్యేలు ర్యాలీ చేపట్టారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత అసెంబ్లీలోకి వెళ్లిన రామచంద్రారెడ్డి కాసేపటికే వాకౌట్ చేసి వచ్చేశారు.
News February 11, 2026
GHMC స్పెషల్ ఆఫీసర్గా జయేశ్ రంజన్

తెలంగాణలోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ను బాధ్యతలు స్వీకరించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగియడంతో పాలనా బాధ్యతల నిర్వహణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. GO 203 ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక నుంచి 3 కార్పొరేషన్ల బాధ్యతలు ఆయన చూసుకోనున్నారు.


