News January 29, 2025
సీపీఎం రాష్ట్ర కమిటీలో ఖమ్మం జిల్లా నుంచి నలుగురికి అవకాశం

సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీలో ఖమ్మం జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఖమ్మం జిల్లా నుంచి ఎర్ర శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, మాచర్ల భారతిని రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన సీపీఎం పార్టీ రాష్ట్ర మహాసభలో ఎన్నుకున్నారు. దీంతో వారికి పలు పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు.
Similar News
News February 18, 2025
బోరుబావుల నుంచి ఉబికి వస్తున్న వేడి నీరు..!

భద్రాద్రి జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మణుగూరు మండలం పగిడేరులో పలు బోరుబావుల నుంచి వేడి నీరు ఉబికి వస్తోంది. ఈ నీటిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండటం వంటి కారణాలతో వేడినీరు వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చి వేడినీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు.
News February 18, 2025
ఖమ్మం – సూర్యాపేట హైవే పై రోడ్డు ప్రమాదం

కూసుమంచి మండలంలో ఖమ్మం – సూర్యాపేట హైవేపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హాట్యతండా సమీపంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారడంతో డీసీఎం వ్యాను డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
News February 18, 2025
ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా చేసిన ఘటన పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. మండాలపాడుకు చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. అతడితో పెళ్లి జరిపించాలని ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. ఆ యువతికి ఆగ్రామ మహిళలు మద్దతుగా నిలిచారు.