News August 12, 2025

సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శిగా నాగరాజు

image

సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శిగా ఎస్.నాగరాజు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 9, 10వ తేదీల్లో నగరిలో సీపీఐ 24వ మహాసభ జరిగింది. నారాయణ, హరినాథ్ రెడ్డి, రామానాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శిగా నాగరాజును ఎన్నుకున్నారు. జిల్లా సహాయ కార్యదర్శులుగా డాక్టర్ జనార్దన్, శివారెడ్డికి అవకాశం దక్కింది.

Similar News

News March 6, 2026

చిత్తూరు జిల్లాలో రూ.24కోట్ల టార్గెట్..!

image

చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లో పన్నుల వసూళ్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 622 పంచాయతీలు ఉన్నాయి. రూ.24 కోట్ల పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు రూ.18 కోట్ల రాబట్టారు. ఈనెల 15వ తేదీలోపు మరో రూ.6 కోట్ల వసూళ్లే లక్ష్యంగా సిబ్బంది గ్రామాల్లో తిరిగి రాబడుతున్నారు.

News March 6, 2026

టెన్త్ పరీక్షల కోసం పక్కాగా ఏర్పాట్లు: DEO

image

టెన్త్ పరీక్షల కోసం చిత్తూరు జిల్లాలో 129 కేంద్రాలు ఏర్పాటు చేశామని DEO రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 23,095 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. బాలురు 12,105 మంది, బాలికలు 10,990 మంది ఉన్నారు. హాల్ టికెట్ చూపించి RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.

News March 6, 2026

చిత్తూరు SE కీలక ఆదేశాలు

image

వేసవి నేపథ్యంలో అవసరాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని చిత్తూరు ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆదేశించారు. ప్రస్తుతం నెలకు 400 పైగా ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయన్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య రెండింతలు వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అప్పుడు ఇబ్బంది పడకుండా కనీసం 1,800 ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని సూచించారు.