News December 1, 2025

సూర్యాపేట: అత్యధిక ఓటర్లున్న గ్రామ పంచాయతీలు ఇవే

image

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య ఆధారంగా టాప్-10 గ్రామాల జాబితా వెలువడింది. మేళ్లచెరువు గ్రామం 10,567 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచి జిల్లాలోనే అతిపెద్ద గ్రామంగా రికార్డు సృష్టించింది. తర్వాతి స్థానాల్లో దొండపాడు (6,737), బేతవోలు (6,468), మఠంపల్లి (6,317), చిలుకూరు (6,041) ఉన్నాయి. మిగతా ఐదు గ్రామాల్లో తుంగతుర్తి, మునగాల, పొనుగోడు, రామాపురం, నూతనకల్ ఉన్నాయి.

Similar News

News February 12, 2026

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్!

image

ఎయిర్‌ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా భారత్ రూ.3.25 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు రాజ్‌నాథ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇండియాకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని సమాచారం. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫేల్ సత్తా చాటిన విషయం తెలిసిందే.

News February 12, 2026

కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ వరుస భేటీలు

image

ఢిల్లీ పర్యటనలో CM రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని రామ్మోహన్ నాయుడును కోరారు. కొత్తగూడెం, అంతర్గాం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి చర్చలు జరిపారు. అశ్వినీ వైష్ణవ్, రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ CM సమావేశమయ్యారు. ఈనెల చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరు కావాలని రాజ్‌నాథ్‌ను ఆహ్వానించారు.

News February 12, 2026

నెల్లూరు: ఆ రెండూ పార్టీలు ఎక్కడ..?

image

TDP, జనసేన, BJP కలిసి కూటమిగా ఏర్పడినా ఆ రెండు పార్టీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనన్న చందంగా మారుతోంది. కూటమిలో జనసేన, BJPలతో టీడీపీ సఖ్యతతో నడవడం లేదంట. జనసేనలో నాయకత్వ పగ్గాలు మోసే వారు కరవయ్యారు. యాక్టీవ్‌గా ఉన్న నేతలు ఇప్పటికే సైడ్ అయిపోయారు. తమకు కూటమితో సంబంధం లేనట్టుగా బీజేపీ వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై పాత పద్ధతిలోనే పోరాడుతోంది. జిల్లాలో 3 పార్టీలదీ తలో దారి అన్నట్టుగా మారింది.