News November 6, 2025

సూర్యాపేట: ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో రూ.3 కోట్ల మోసం

image

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. సూర్యాపేటకు చెందిన గడ్డం లక్ష్మణ్ కుమార్ ట్రేడింగ్ పేరుతో సూర్యాపేట, తిరుమలగిరి ప్రాంతాల్లో ప్రజలను మోసం చేసి రూ.3 కోట్లు కాజేశాడని వివరించారు. ఈ మోసగాడి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.

Similar News

News January 15, 2026

PhonePe రూ.5వేల గిఫ్ట్.. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

image

సంక్రాంతి వేళ వాట్సాప్ గ్రూపుల్లో ఓ లింక్ వైరల్‌గా మారింది. ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్- అన్ని వినియోగదారులకు రూ.5000’ అంటూ ఓ లింక్‌ షేర్ అవుతోంది. యూజర్లను టెంప్ట్ చేసేలా ఉన్న ఈ లింక్ ఓపెన్ చేస్తే ‘404’ అని వస్తోంది. కాగా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. డబ్బులకు ఆశపడి లింకులు ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

News January 15, 2026

తిరుపతి: ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు…?

image

TTD, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా ప్రజలు భూ సమస్యను ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో శేషసాయి నగర్‌లో ఉన్న భూములను 22A క్రింద తీసుకొచ్చారు. దీంతో ఈ ల్యాండ్స్ లేఅవుట్ అనుమతులు, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు రాకుండా నిలిచిపోయాయి. 22A నిబంధనలు, IDT క్లెయిమ్స్ వల్ల చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములను అనుభవించలేక, వేరొకరికి అమ్మలేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

News January 15, 2026

నెల్లూరు: ‘నాకు రూ.5 వేలు వచ్చాయి’ అంటూ మెసేజ్ వచ్చిందా..

image

వాట్సాప్ గ్రూపులలో ‘నాకు రూ.5 వేలు వచ్చాయి. నేను నకిలీ అనుకున్నాను. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు పది మందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి’ అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని చేజర్ల ఎస్సై తిరుమలరావు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దన్నారు.