News November 19, 2025
సూర్యాపేట జిల్లా వాసికి అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యా విభాగానికి చెందిన డా.రావుల కృష్ణయ్య పరిశోధక విద్యార్థిని సాక్షి సంయుక్తంగా చేసిన పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వారు రూపొందించిన పరిశోధనా పత్రం, జర్మన్ కమిషన్ ఫర్ యునెస్కో, జర్మన్ రెక్టర్స్ కాన్ఫరెన్స్ సంయుక్తంగా జర్మనీలోని హానోవర్లో నవంబర్ 19-21 మధ్య నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో సమర్పణకు ఎంపికైంది.
Similar News
News January 19, 2026
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో జిల్లాకు మూడు పతకాలు

ఆదిలాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-12 బాలుర 400 మీటర్ల పరుగులో పి. గోవింద్ వెండి పతకం సాధించగా, అండర్-10 విభాగంలో జి. జితేష్ (60 మీటర్లు), అండర్-8 విభాగంలో మరో క్రీడాకారుడు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. జిల్లాకు మూడు పతకాలు రావడంపై అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు పరమేశ్వర్, వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు.
News January 19, 2026
ఇండియా క్యాంప్కు ఎంపికైన గుంతకల్లు క్రీడాకారిణి మానస

ఖేలో ఇండియా, జాతీయ సెపక్ తక్రా క్రీడా అంశానికి సంబంధించి గుంతకల్లుకు చెందిన మానస ప్రతిభ కనబరిచి ఇండియన్ క్యాంప్కు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి బ్యాంకాక్లో, అనంతరం ఢిల్లీలో జరిగే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ఆసియా గేమ్స్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
News January 19, 2026
కామారెడ్డి: ప్రియం కానున్న ఓటు విలువ

ఇంకా మున్సిపల్ ఎలక్షన్ కోడ్ కూయక ముందే కామారెడ్డిలో రాజకీయ వేడి మొదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎక్కడిక్కడ ఆశావాహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మందుగా విందు ఇస్తూ ఓటర్లతో మమేకమవుతున్నారు. టికెట్ తెచ్చుకునే బాధ్యత మాది, గెలిపించే బాధ్యత మీది అంటూ సవాలు చేస్తున్నారు. ఈ సారి యువత పోటీలో ఉండేందుకు తీవ్ర కసరత్తు ప్రారంభించారు. దీంతో కామారెడ్డి మున్సిపల్ మరింత ప్రియం కానుంది.


