News August 13, 2025
సూర్యాపేట: డీటీఓ ప్రకటనపై పెన్షనర్ల ఖండన

75 ఏళ్లు నిండిన పెన్షనర్లు వ్యక్తిగత తనిఖీల కోసం ఎస్టీఓలను కలవాలన్న సూర్యాపేట జిల్లా డీటీఓ ప్రకటనను తెలంగాణ పెన్షనర్ల ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డీటీఓ తీసుకున్న నిర్ణయం వల్ల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారని, ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదన్నారు. పెన్షనర్ల ఐకాస జిల్లా అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు సమర్థించారు.
Similar News
News March 15, 2026
గద్వాల: గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై కలెక్టర్ హెచ్చరిక

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గ్యాస్ పక్కదారి పట్టకుండా 11 మంది అధికారులతో ‘డిస్ట్రిక్ట్ ఎనర్జీ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 11 గ్యాస్ ఏజెన్సీలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.
News March 15, 2026
తిరుపతి: మీకూ మెసేజ్లు వస్తున్నాయా..

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ CMD శివశంకర్ లోతేటి కోరారు. మీ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిస్తూ, మరిన్ని వివరాల కోసం OTP చెప్పమని, ఈ క్లిక్ నొక్కాలని తదితర మోసపూరిత సందేశాలను నమ్మవద్దని సూచించారు. వినియోగదారులు సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని కోరారు.
News March 15, 2026
నరసరావుపేటలో చికెన్ ధరల సెగ.. కేజీ ఎంతంటే!

నరసరావుపేటలో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. లైవ్ కోడి కిలో రూ. 175 ఉండగా, స్కిన్ లెస్ ధర రూ. 345కు చేరింది. మటన్ కిలో రూ. 1000 వరకు పలుకుతోంది. ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు మాంసం కొనాలంటేనే జంకుతున్నారు. సరఫరా మెరుగుపడితేనే ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


