News August 23, 2025

సెప్టెంబర్ 6న భద్రాద్రి జిల్లాకు KTR రాక

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే నెల జిల్లాలో పర్యటించనున్నారని BRS నాయకుడు దిండిగాల రాజేందర్ వెల్లడించారు. ఇల్లందులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ 6న కొత్తగూడెం, భద్రాచలంలో కేటీఆర్ పర్యటిస్తారని తెలిపారు. ఆయన పర్యటన విజయవంతానికి ఈనెల 24న కొత్తగూడెంలోని BRS జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 16, 2026

నిజామాబాద్‌లో కొండెక్కిన చికెన్ ధరలు

image

నిజామాబాద్‌లో చికెన్ ధరలు కొండక్కాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 320 ఉండగా, స్కిన్ చికెన్ 300గా ఉంది. లైవ్ చికెన్ లైవ్ చికెన్ రూ.260 గా ఉంది. చేపలు రవాటాలు కిలో రూ.200 ఉండగా, మొట్ట చేపలు రూ.700 కిలోకు విక్రయిస్తున్నారు. అయితే సంక్రాంతి కనుమ పండుగ కావడంతో అధిక మొత్తంలో మాంసం తినడం ఆచారంగా వస్తోంది. మాంసం కొనేందుకు సైతం అధిక ఆసక్తి కనబడుతున్నారు.

News January 16, 2026

ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

image

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

News January 16, 2026

నంద్యాల: అవును.. మీకు తెలుసా..!

image

నల్లమల అడవిలోని గిరిజన గూడాల్లో నివసించే చెంచులు శ్రీశైల భ్రమరాంబ దేవిని కూతురుగా, మల్లికార్జున స్వామిని ఇంటి అల్లుడిగా భావిస్తారు. దీంతో మకర సంక్రాంతి రోజున పార్వతి పరమేశ్వరుల లీల కళ్యాణ మహోత్సవానికి చెంచులే అతిథులుగా నిలిచి, ఈత ఆకులతో ఆభరణాలు తయారుచేసి వాటితో స్వామి, అమ్మవార్లను అలంకరిస్తారు. ఈత ఆకులతో అమ్మవారికి మెట్టెలు, గాజులు, మెడలో ధరించేందుకు ఆభరణాలు, బాసికాలు రూపొందించారు.