News November 30, 2025
సైబర్ నేరాలకు అప్రమత్తతోనే అడ్డుకట్ట: ADB SP

సైబర్ నేరాలను ప్రజల అప్రమత్తతోనే అడ్డుకట్ట వేయగలమని జిల్లా SP అఖిల్ మహాజన్ వివరించారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న నవీన పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 ద్వారా పోలీసు సహాయాన్ని పొందవచ్చని సూచించారు.
Similar News
News February 10, 2026
కరీంనగర్లో 23 ప్రత్యేక బృందాలతో నిఘా

ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు 23 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ఎన్నికల ఉల్లంఘనలపై ప్రజలు 87126 70744, 87126 70745 నంబర్లకు లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
News February 10, 2026
మేడారం భక్తులకు కృతజ్ఞతలు తెలిపిన TGSRTC

మేడారం జాతరకు నేరుగా వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అమ్మవారి ప్రసాదాన్ని నేరుగా అందిస్తామని అవకాశం కల్పించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల నుంచి 1910 కుటుంబాలు అమ్మవారి ప్రసాదాన్ని ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకున్నాయి. ఈ సేవలతో పాటు బస్సుల్లో ప్రయాణించిన వారికి ఆర్టీసీ సంస్థ ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులకు కృతజ్ఞతలు తెలిపింది.
News February 10, 2026
మహాశివరాత్రి సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం పార్వతీపురంలోని తన కార్యాలయం నుంచి VC నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకొని తగిన బందోబస్తు ఏర్పాట్లు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధుల పట్ల తగు సూచనలు, కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు సులభమైన, సురక్షితమైన దర్శనాన్ని కల్పించేలా క్యూ లైన్ల వద్ద బందోబస్త్ పెంచాలన్నారు.


