News December 3, 2025

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

భూపాలపల్లి జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం విద్యార్థులకు అవగాహన సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు రూ.2 వేల కోట్లు సైబర్ మోసాల రూపంలో నష్టం జరుగుతోందన్నారు. దీనికి నివారణ ప్రజల్లో అవగాహన పెంపే ప్రధాన మార్గమని,విద్యార్థులు సైబర్ భద్రతపై తమ కుటుంబాలు, పరిసరాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News February 19, 2026

తక్కువ ధరల్లో పశు ఔషధాలు: అచ్చెన్నాయుడు

image

AP: పశుపోషకులకు సబ్సిడీ ధరల్లో జనరిక్ పశు ఔషధాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘దీనికోసం పశు వైద్యశాలల ఆవరణలో 150 ఔషధ విక్రయ కేంద్రాలు పెడతాం. గొర్రెల పెంపక సహకార సంఘాలకు వీటిని అప్పగిస్తాం. ₹5.41 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలుచేస్తాం. యూనిట్ పెట్టేవారికి ప్రత్యేక సాయం కింద ₹1.5 లక్షలు అందిస్తాం. కొనుగోలుపై 20% ప్రోత్సాహకం, విక్రయాలపై 20% మార్జిన్ లభిస్తుంది’ అని మంత్రి చెప్పారు.

News February 19, 2026

HYD: ‘సెటిల్’ అంటే పెళ్లి కాదు

image

‘ముందు నా లైఫ్.. ఆ తర్వాతే ఎవరైనా’ నేటి యువత మంత్రం ఇదే. పాతతరంలా పెళ్లి, పిల్లలే జీవిత పరమార్థం అని వీరు అనుకోవడం లేదు. ట్రావెలింగ్, ప్యాషన్ ప్రాజెక్ట్స్, మెంటల్ హెల్త్‌కే ఫస్ట్ ప్రయారిటీ. పెళ్లైనా.. తమకంటూ కొంత పర్సనల్ స్పేస్ కావాలని కోరుకుంటున్నారు. ఇంట్లో ఆ స్వేచ్ఛ దొరకనప్పుడు జిమ్ములు, కేఫ్‌లు, ఆఫీసుల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ తమను తాము వెతుక్కునే పనిలో పడ్డారు.

News February 19, 2026

HYD: ‘సెటిల్’ అంటే పెళ్లి కాదు

image

‘ముందు నా లైఫ్.. ఆ తర్వాతే ఎవరైనా’ నేటి యువత మంత్రం ఇదే. పాతతరంలా పెళ్లి, పిల్లలే జీవిత పరమార్థం అని వీరు అనుకోవడం లేదు. ట్రావెలింగ్, ప్యాషన్ ప్రాజెక్ట్స్, మెంటల్ హెల్త్‌కే ఫస్ట్ ప్రయారిటీ. పెళ్లైనా.. తమకంటూ కొంత పర్సనల్ స్పేస్ కావాలని కోరుకుంటున్నారు. ఇంట్లో ఆ స్వేచ్ఛ దొరకనప్పుడు జిమ్ములు, కేఫ్‌లు, ఆఫీసుల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ తమను తాము వెతుక్కునే పనిలో పడ్డారు.