News December 3, 2025
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

భూపాలపల్లి జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం విద్యార్థులకు అవగాహన సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు రూ.2 వేల కోట్లు సైబర్ మోసాల రూపంలో నష్టం జరుగుతోందన్నారు. దీనికి నివారణ ప్రజల్లో అవగాహన పెంపే ప్రధాన మార్గమని,విద్యార్థులు సైబర్ భద్రతపై తమ కుటుంబాలు, పరిసరాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News February 17, 2026
ఈనెల 19న కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలు

కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలు ఈనెల 19న నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భీమారావు తెలిపారు. అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్షలు శ్రీ బాలాజీ PG కాలేజీ, PVKK ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు, కావలసిన వస్తువులతో పాటు గంట ముందుగానే హాజరుకావాలని ఒక ప్రకటనలో తెలిపారు.
News February 17, 2026
ఈనెల 19న కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలు

కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలు ఈనెల 19న నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భీమారావు తెలిపారు. అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్షలు శ్రీ బాలాజీ PG కాలేజీ, PVKK ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు, కావలసిన వస్తువులతో పాటు గంట ముందుగానే హాజరుకావాలని ఒక ప్రకటనలో తెలిపారు.
News February 17, 2026
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టర్ ఫ్లాప్!

శ్రీశైలంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు అట్టర్ ఫ్లాప్ అయినట్లు హిందూ సంఘాలు, భక్తులు ఆరోపిస్తున్నారు. బ్రహ్మోత్సవాల నెల ముందు నుంచే జిల్లా యంత్రాంగం సమీక్షా సమావేశాలు నిర్వహించినా అన్ని శాఖల సమన్వయ లోపంతో ఉత్సవాలు విజయవంతం కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలిరోజే భారీగా ట్రాఫిక్ జామ్, మరుసటి రోజు భక్తులపై లాఠీఛార్జ్ తదితర ఘటనలు జరిగాయి. చివరికి కలెక్టర్, DIG, SP రంగంలోకి దిగాల్సి వచ్చింది.


