News September 11, 2025
సైబర్ మోసానికి గురైన కాకినాడ ఎంపీ

కాకినాడ ఎంపీ ఉదయశ్రీనివాస్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆయన ఫైనాన్స్ మేనేజర్కు 4 రోజుల క్రితం ఓ ఆగంతకుడు ఎంపీ డీపీతో ఉన్న వాట్సాప్ సందేశం పంపాడు. తాను కొత్త నంబర్ వాడుతున్నా, నగదు బదిలీ చేయాలని సూచిస్తే అది నిజమని నమ్మిన మేనేజర్ 11 విడతల్లో రూ.92 లక్షల బదిలీ చేశారు. దీనిని ఈనెల 8న ఎంపీ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఎక్కడ జరిగింది అన్నది బయటికి రాలేదు. ఇది నిజమేనని ఎంపీ పీఏ తెలిపారు.
Similar News
News December 6, 2025
471 పంచాయతీలు.. 3 విడతల్లో ఎన్నికలు

నేటితో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లోని 471 గ్రామపంచాయతీల నుంచి సర్పంచ్, 4168 వార్డు సభ్యులకు కోసం నామినేషన్లు స్వీకరించారు. మొదటి విడతలో 8 మండలాలకు 11న, 2వ విడతలో 7 మండలాలకు 14న, 3వ విడతలో 7 మండలాలకు 17న ఎన్నికలు జరగనున్నాయి. 4242 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రకటించారు.
News December 6, 2025
ఎర్రవల్లి: వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచి అభ్యర్థులు ఆయన్ను కలిశారు. వచ్చేది మన ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కొన్ని కష్టాలు వచ్చినా బెదరకూడదని అన్నారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు.
News December 6, 2025
విమానానికి బాంబు బెదిరింపు.. తీవ్ర కలకలం

TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఫ్లైట్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్ను ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైట్లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.


