News October 7, 2025

సైబర్ వలలో మోసపోయిన రైతు

image

సైబర్ నేరగాళ్లు రాయదుర్గం రైతు పాటిల్ ఎర్రితాతను బురిడీ కొట్టించారు. కణేకల్లు మండలం తుంబిగనూరుకు చెందిన ఆయన ఇటీవల సజ్జలు విక్రయించడంతో ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఈ క్రమంలో సైబర్ కేటుగాళ్లు పాటిల్ ఖాతాలోని రూ.75 వేలను మాయం చేశారు. అకౌంట్‌లో డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో బ్యాంకు ప్రతినిధులను సంప్రదించారు. సైబర్ మోసమని తెలుసుకుని రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News January 14, 2026

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: మంత్రి పార్థసారధి

image

జిల్లాలో రైతుల అవసరాలకు మించి యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పార్థసారధి తెలిపారు. మంగళవారం నరసింహారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం‌ను సందర్శించి, రైతులు, అధికారులతో మాట్లాడారు. జిల్లాకు 10,073 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 12 వేల టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం రైతులకు అధిక మొత్తంలో ఎరువులు అందజేస్తున్నామని మంత్రి వివరించారు.

News January 14, 2026

ఎంఎస్‌ఎంఈ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

image

దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని పరిశ్రమల శాఖ రాష్ట్ర కార్యదర్శి యువరాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సోమవరప్పాడులో పార్కు కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించి, సమగ్ర నివేదిక పంపాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.

News January 14, 2026

అరసవల్లిలో ‘సామాన్య’ దర్శనానికే పెద్దపీట

image

అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకే అగ్రతాంబూలం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రతి సెక్టార్లో కీలక శాఖల అధికారులు అందుబాటులో ఉండి పర్యవేక్షించాలనిన్నారు